సలాలా, అలెగ్జాండ్రియాలకు సీజనల్ విమానాల్ని పెంచనున్న ఎతిహాద్
- December 27, 2019
ఎతిహాద్ ఎయిర్వేస్, అబుదాబీ నుంచి సలాలా, ఒమన్ అలాగే అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లకు జూన్ 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్య అదనంగా సర్వీసుల్ని నడపనుంది. ఈ ఏడాది ఈ రూట్స్లో సాధించిన సక్సెస్తో, వచ్చే ఏడాది సర్వీసుల్ని పెంచడంతోపాటు, సీజన్ని 3 వారాలపాటు పెంచడానికి అలాగే ఐదవ వీక్లీ సర్వీస్ని ప్రవేశపెట్టడానికీ నిర్ణయం తీసుకున్నట్లు ఎతిహాద్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మంగళ, గురు, శని అలాగే ఆదివారాలతోపాటు శుక్రవారం కూడా విమానాలు ప్రయాణమవుతాయి. ఎయిర్బస్ ఎ320 విమానాల్ని ఈ మార్గాల్లో నడుపుతారు. వారానికి 26 విమానాల్ని ఒమన్కి నడుపుతారు. అందులో మస్కట్కి 21, సలాలాకి 5 విమానాలుంటాయి. ఈజిప్ట్కి మొత్తం 33 విమానాలు నడుపుతారు. అందులో 28 కైరోకి, ఐదు అలెగ్జాండ్రియాకి నడుపుతారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







