పెజావర స్వామీజీ కన్నుమూత
- December 29, 2019
బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం ఆయనను మణిపాల్ కేఎంసీ ఆస్పత్రి నుంచి ఉడుపి మఠానికి తరలించారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని చెబుతుండే స్వామీజీ ...అన్నట్లుగా ఆయన మఠంలోనే పరమపదించారు. కాగా అనారోగ్యంతో ఆయన ఈ నెల 20న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే పెజావర మఠాధిపతి ఆరోగ్యం రోజు...రోజుకు క్షీణించడంతో పాటు, కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆయనను ఉడుపి మఠానికి తరలించారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి యొడియూరప్ప ఉడుపి చేరుకున్నారు. ఇవాళ శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న సీఎం ఉడుపిలోనే ఉండనున్నారు. అలాగే కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు. అలాగే పెజావర స్వామీజీ మరణ వార్త తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలి వస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!