పెజావర స్వామీజీ కన్నుమూత
- December 29, 2019
బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం ఆయనను మణిపాల్ కేఎంసీ ఆస్పత్రి నుంచి ఉడుపి మఠానికి తరలించారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని చెబుతుండే స్వామీజీ ...అన్నట్లుగా ఆయన మఠంలోనే పరమపదించారు. కాగా అనారోగ్యంతో ఆయన ఈ నెల 20న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే పెజావర మఠాధిపతి ఆరోగ్యం రోజు...రోజుకు క్షీణించడంతో పాటు, కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆయనను ఉడుపి మఠానికి తరలించారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి యొడియూరప్ప ఉడుపి చేరుకున్నారు. ఇవాళ శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న సీఎం ఉడుపిలోనే ఉండనున్నారు. అలాగే కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు. అలాగే పెజావర స్వామీజీ మరణ వార్త తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలి వస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







