CAA, ఆర్టికల్ 370 పై ఇస్లామిక్ దేశాల మీటింగ్...
- December 29, 2019
పాకిస్తాన్:జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత జరిగిన పరిణామాలను అంచనా వేసేందుకు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసి) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషితో జరిగిన సమావేశంలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్-సౌద్ ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ సమావేశాన్ని ఓఐసి సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ముందుకు రావడాన్ని పాకిస్తాన్ పూర్తిగా సమర్థించింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో కాశ్మీర్ సమస్యతో పాటు భారత పౌరసత్వ సవరణ చట్టంపైనా, NRC పైన కూడా చర్చించామని ఖురేషి అన్నారు. ఈ పరిణామాలు భారత్, సౌదీ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని పలువరు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







