దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్ బచ్చన్

- December 29, 2019 , by Maagulf
దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్ బచ్చన్

ఢిల్లీ:బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అమితాబ్ దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును అందుకున్నారు.

ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుని మొదటి సంవత్సరం దేవికారాణితో మొదలుపెట్టి ఇప్పటివరకు మొత్తం 67 మందికి అందించారు. ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com