మస్కట్:ప్రవాసీయుల OCI కార్డ్స్ రెన్యూవల్ డెడ్ లైన్ పొడగింపు
- December 29, 2019
మస్కట్: ఒమన్ కు వలసవెళ్లిన ఇండియన్స్ కి జారీ చేసే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్-OCI డెడ్ లైన్ వచ్చే జూన్ 30 వరకు పొడగించారు. అప్పటివరకు ప్రస్తుత కార్డులతో ట్రావెల్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే పాత పాస్ పోర్టుతో పాటు కొత్త పాస్ పోర్టును తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. పాత పాస్ట్ పోర్ట్ OCI కార్డ్ వివరాల చెక్ చేస్తారు. కొత్త పాస్ పోర్టు ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తారు.
OCI కార్డులకు సంబంధించి మస్కట్ లోని భారత్ రాయబార కార్యాలయం నోటీస్ జారీ చేసింది. 20 ఏళ్ల లోపు, 50 ఏళ్లకు పైబడిన వారు OCI కార్డు పొందెందుకు వచ్చే జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్లు నోటీస్ లో పేర్కొంది. అలాగే 20 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు, 50 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ట్రావెల్ సమయంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నోటీస్ లో రాయబార కార్యాలయం మెన్షన్ చేసింది.
20 ఏళ్లలోపు వయస్సున్న వారు పాస్ పోర్టు చేంజ్ చేసుకున్నా OCI కార్డు పొందకపోతే..పాత పాస్ పోర్టులో ని OCI కార్డు వివరాలతో ట్రావెల్ చేయవచ్చు. అయితే..కొత్త పాస్ పోర్టును ఐడెంటిఫికేషన్ కోసం చూపించాల్సి ఉంటుంది. అంటే రెండు పాస్ పోర్టులను తప్పనిసరిగా క్యారీ చేయాల్సిందే. అలాగే 50 ఏళ్లపై బడిన వారు కూడా పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకున్నా OCI కార్డు తీసుకోకపోతే పాత పాస్ పోర్టులో నమోదైన OCI కార్డును అనుమతిస్తారు. ఐడెంటీఫికేషన్ కోసం కొత్త పాస్ పోర్టు చూపించాల్సి ఉంటుంది. అయితే..వచ్చే జూన్ 30లోపు మాత్రం OCI కార్డును తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని రాయబార కార్యాలయం తెలిపింది.
20 ఏళ్ల లోపు, 50 ఏళ్లపైబడిన వారికి పాస్ పోర్టు రెన్యూవల్ చేసిన ప్రతీసారి OCI కార్డు రీఇష్యూ తప్పనిసరి. 20-50 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రం పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసిన ప్రతీసారి OCI కార్డు రి ఇష్యూ అవసరం లేదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు