తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..దేశ సైన్యాధిపతి మృతి
- January 02, 2020


తైపీ: హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తైవాలం సైన్యాధిపతితో సహా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దెస రాజధాని తైపీ సమీపంలోని ఒక పర్వతం పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈశాన్య యిలాన్ కౌంటీలో సైనికులను కలవటానికి తైవాలం చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్-ఇ-మింగ్ బయలుదేరారు.ఈ ఉదయం 7:50 నిమిషాలకు సొంగ్షాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ బయలుదేరింది. 8:06 నిమిషాలకు సిబ్బంది నుంచి ఆఖరి సమాచారం వచ్చింది.ఆపై ఒక్క నిమిషం తరువాత నుంచి దానితో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఆ హెలికాఫ్టర్ తైపీ పట్టణం సమీపంలోని పర్వతాలలో కూలిపోయింది. కూలిపోయిన UH60M హెలికాఫ్టర్ లో 62 సంవత్సరాల మింగ్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







