తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..దేశ సైన్యాధిపతి మృతి
- January 02, 2020


తైపీ: హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తైవాలం సైన్యాధిపతితో సహా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దెస రాజధాని తైపీ సమీపంలోని ఒక పర్వతం పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈశాన్య యిలాన్ కౌంటీలో సైనికులను కలవటానికి తైవాలం చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్-ఇ-మింగ్ బయలుదేరారు.ఈ ఉదయం 7:50 నిమిషాలకు సొంగ్షాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ బయలుదేరింది. 8:06 నిమిషాలకు సిబ్బంది నుంచి ఆఖరి సమాచారం వచ్చింది.ఆపై ఒక్క నిమిషం తరువాత నుంచి దానితో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఆ హెలికాఫ్టర్ తైపీ పట్టణం సమీపంలోని పర్వతాలలో కూలిపోయింది. కూలిపోయిన UH60M హెలికాఫ్టర్ లో 62 సంవత్సరాల మింగ్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







