ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్పై బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ స్పందన
- January 03, 2020
మనామా:బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్ కౌన్సిల్, తమ ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియాలో సిటిజన్షిప్ యాక్ట్ అమలుపై స్పందించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, హ్యూమన్ రైట్స్, సివిలైజేషనల్ ప్రాక్టీసెస్కి అనుగుణంగా ఇండియా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇండియాలో గత కొద్ది రోజులుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయమై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఈ విషయమై భారత ప్రభుత్వం పునరాలోచించాలని బహ్రెయిన్ విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో ముస్లింల అభిప్రాయాల్నీ అక్కడి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. భారత్తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందనీ, ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించింది బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్స్ కౌన్సిల్.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







