విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో రెండు అంతర్జాతీయ సర్వీసులు

- January 04, 2020 , by Maagulf
విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో రెండు అంతర్జాతీయ సర్వీసులు

విజయవాడ: విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో రెండు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విజయవాడ నుంచి దోహా, ముంబయిలకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఈ విదేశీ సర్వీసులను నడపటానికి ఆసక్తి చూపిస్తోంది. విజయవాడ నుంచి ముంబయికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ వారంలో మూడు రోజులు బోయింగ్‌ 737-800 విమాన సర్వీసులను న డుపుతోంది. ఇక్కడి నుంచి బయల్దేరే ఈ సర్వీసు మూడు రోజుల్లో ఒకరోజు దోహాకు, మరోరోజు షార్జాకు నడపాలని భావిస్తున్నారు. అయితే, ఆయా దేశాలకు ఇక్కడి నుంచి వెళ్లేవారు ముంబయికి కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. బ్యాగేజీ చెకిన్‌ వంటివి విజయవాడ విమానాశ్రయంలోనే నిర్వహిస్తారు. బోర్డింగ్‌ పాస్‌ కూడా ఇక్కడే ఇస్తారు. ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ చెకిన్‌ పూర్తి చేసుకుంటే చాలు. విజయవాడ విమానాశ్రయంలో కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌లు ఉన్నాయి. అయినా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ముంబయిలోనే కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ చెకిన్‌ నిర్వహించనున్నారు.

విజయవాడ విమానాశ్రయంలో లగేజీ చెకిన్‌, బోర్డింగ్‌ పాస్‌ పూర్తయినవారు మాత్రం ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ హోల్డింగ్‌ ఏరియాలోకి వెళ్లిపోవచ్చు. అక్కడ క్లియరెన్స్‌ అయ్యాక నేరుగా ఆయా దేశాలకు వెళ్లే విమానాల్లో వెళ్లిపోవచ్చు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. ముంబయికి వచ్చిన విమానంలోనే దోహా, షార్జాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరో విమాన సర్వీసులో వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ విమానాలు ఏ రోజు, ఏ ప్రాంతానికి నడుపు తారన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 45 రోజుల్లోపే విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com