ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్కాం..వుమెన్ ఎంప్లాయ్ కి మూడేళ్ల జైలు శిక్ష

- January 04, 2020 , by Maagulf
ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్కాం..వుమెన్ ఎంప్లాయ్ కి మూడేళ్ల జైలు శిక్ష

బహ్రెయిన్ : ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వ సొమ్మును కాజేసిన మహిళా ఉద్యోగికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జిధాఫ్స్ మెటర్నటీ హస్పిటల్ లో పని చేస్తున్న ఆమె..ఫోర్జరీ డాక్యుమెంట్లతో దాదాపు లక్ష బహ్రెయిన్ డాలర్లను కాజేసినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆడిట్  సమయంలో ఈ ఫ్రాడ్ బయటపడినట్లు హెల్త్ మినిస్ట్రీ నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్కాం విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేసి  కోర్టులో హజరుపరిచారు. కోర్టు విచారణలో ఆమెపై అభియోగాలు రుజువు కావటంతో మూడేళ్ల జైలు శిక్షతో పాటు 111,708 బహ్రెయిన్ దినార్ లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com