ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్కాం..వుమెన్ ఎంప్లాయ్ కి మూడేళ్ల జైలు శిక్ష
- January 04, 2020
బహ్రెయిన్ : ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వ సొమ్మును కాజేసిన మహిళా ఉద్యోగికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జిధాఫ్స్ మెటర్నటీ హస్పిటల్ లో పని చేస్తున్న ఆమె..ఫోర్జరీ డాక్యుమెంట్లతో దాదాపు లక్ష బహ్రెయిన్ డాలర్లను కాజేసినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆడిట్ సమయంలో ఈ ఫ్రాడ్ బయటపడినట్లు హెల్త్ మినిస్ట్రీ నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్కాం విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. కోర్టు విచారణలో ఆమెపై అభియోగాలు రుజువు కావటంతో మూడేళ్ల జైలు శిక్షతో పాటు 111,708 బహ్రెయిన్ దినార్ లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..