తెలుగురాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
- January 06, 2020
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనానికి బారులు తీరారు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన సుదినం వైకుంఠ ఏకాదశి. దేవతలకు బ్రహ్మ మూహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు ఇది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు
వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రముఖమైనది. ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వరున్ని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలను పూజించి న అదృష్టం వస్తుందని నమ్మకం. అందుకే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆలయాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నారు. స్వామివారి దర్శనం, ప్రసాద వితరణకు ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







