తెలుగురాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
- January 06, 2020
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనానికి బారులు తీరారు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన సుదినం వైకుంఠ ఏకాదశి. దేవతలకు బ్రహ్మ మూహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు ఇది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు
వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రముఖమైనది. ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వరున్ని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలను పూజించి న అదృష్టం వస్తుందని నమ్మకం. అందుకే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆలయాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నారు. స్వామివారి దర్శనం, ప్రసాద వితరణకు ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!