విదేశీ బలగాలను బహిష్కరిస్తాం
- January 06, 2020
బాగ్దాద్:తమ దేశంలో ఉన్న విదేశీ బలగాలను బహిష్కరించనున్నట్టు ఇరాక్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తమ దేశంలో ఉన్న విదేశీ బలగాలను బహిష్కరించడమే లక్ష్యంగా తీర్మానానికి పార్లమెంటు మద్దతు పలికింది. ముఖ్యంగా ఇరాక్లో ప్రస్తుతం ఉన్న 5 వేల మంది అమెరికా బలగాలే లక్ష్యంగా వారు తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాగ్దాద్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య జరిగిన రెండు రోజుల అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. నాలుగేండ్ల కిందట ఐఎస్తో పోరాటం చేయడానికి ఇరాక్కు సహాయంగా అమెరికా తమ దళాలను పంపేందుకు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు నాలుగేండ్ల తర్వాత ఈ తీర్మానం ఆ ఒప్పందానికి ముగింపు పలకనుంది. ఇదిలా ఉండగా, బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు క్షిపణి దాడికి పాల్పడటాన్ని ఇరాక్ ఆపద్ధర్మ ప్రధాని అబ్దెల్ అబ్దుల్ మహ్దీ సీరియస్గా తీసుకున్నారు. అమెరికా చర్యలు తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీశాయని విమర్శించారు. మున్ముందు కూడా అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశముందని అన్నారు. అందుకే, యూఎస్ బలగాలను శాశ్వతంగా తమ భూభాగం నుంచి పంపించాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!