ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు:సాయం కోసం ముందుకొచ్చిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌

- January 08, 2020 , by Maagulf
ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు:సాయం కోసం ముందుకొచ్చిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌

ఆస్ట్రేలియాలో ఇటీవల చోటు చేసుకున్న తీవ్రమైన కార్చిచ్చు విషయమై సహాయం అందించేందుకు తాము సిద్ధంగా వున్నట్లు అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో షేక్‌ మొహమ్మద్‌ ఈ మేరకు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఆస్ట్రేలియాకి యూఏఈ ఈ విషయంలో అండగా వుంటుందని షేక్‌ మొహమ్మద్‌ చెప్పారు. మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ - ఆస్ట్రేలియన్‌ గవర్నమెంట్‌తో కలిసి ఈ విషయమై పనిచేస్తుందని ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్‌కి షేక్‌ మొహ్మద్‌ బిన్‌ జాయెద్‌ చెప్పారు. ఈ కార్చిచ్చులో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మిలియన్ల కొద్దీ జంతు జాలం మృత్యువాత పడింది. సెప్టెంబర్‌ నుంచి ఈ కార్చిచ్చు రగులుతోంది.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com