మెక్సికోలో ఘోర ప్రమాదం..21 మంది మృతి
- January 08, 2020
మెక్సికో:మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో రైలు వేగానికి బస్సు రెండుగా తునాతునకలైంది. తమావుపాలిస్ రాష్ట్రంలోని అనాహుక్ టౌన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద స్టాప్ లైట్ ను బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. బస్సులో 40 మంది ప్రయాణికులకు మాత్రమే అవసరమైనన్ని సీట్లు ఉన్నప్పటికీ 60 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే బస్సు డ్రైవర్ గాయాలతో బతికి బయటపడినట్టు సమాచారం. ఈ యాక్సిడెంట్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







