మెక్సికోలో ఘోర ప్రమాదం..21 మంది మృతి
- January 08, 2020
మెక్సికో:మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో రైలు వేగానికి బస్సు రెండుగా తునాతునకలైంది. తమావుపాలిస్ రాష్ట్రంలోని అనాహుక్ టౌన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద స్టాప్ లైట్ ను బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. బస్సులో 40 మంది ప్రయాణికులకు మాత్రమే అవసరమైనన్ని సీట్లు ఉన్నప్పటికీ 60 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే బస్సు డ్రైవర్ గాయాలతో బతికి బయటపడినట్టు సమాచారం. ఈ యాక్సిడెంట్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







