'నేను కేర్ ఆఫ్ నువ్వు' చిత్రం ఫిబ్రవరి 14న విడుదల
- January 09, 2020
ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల,శేషిరెడ్డి,పోలీస్ వెంకటరెడ్డి,శరద్ మిశ్రాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుటకు రావడం జరిగింది.
ఈ సందర్భంగా లిరిక్ రైటర్ ప్రణవం మాట్లాడుతూ....
ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు సందగర్భానుసారం వస్తాయి. ఈ చిత్రంలో నాకు అగాపే అకాడమీ బ్యానర్ వారు అవకాశం ఇచ్చారుమ్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.
నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ....
ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ....
సినిమా ట్రైలర్ చూశాను బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది ఇది. సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది అన్నారు.
డైరెక్టర్ సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ....
ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించాను. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. చిన్న సినిమాలు సక్సెస్ కావాలంటే అందరి సహకారం కావాలి. ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.
బ్యానర్: అగపే అకాడమీ
డిఓపి: జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్: ప్రణవం
మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్
ఆర్ట్: పి.ఎస్.వర్మ
యాక్షన్: షొలిన్ మల్లేష్
కొరియోగ్రాఫర్: నరేష్
సహా నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, శరద్ మిశ్రా
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







