అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చికిత్స నిమిత్తం దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి
- January 10, 2020
యూ.ఏ.ఈ:39 ఏళ్ళ ఆసియా వ్యక్తి ఒకరు 7,500 దిర్హామ్లను కంపెనీ కారు నుంచి దొంగిలిస్తూ దొరికిపోయాడు. విచారణ సందర్భంగా నిందితుడు, ఆ డబ్బును తాను దొంగిలించింది అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్య చికిత్స చేసేందుకోసమేనని చెప్పాడు. నిందితుడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది. దొంగిలించిన సొమ్ముల్లోంచి 1,000 దిర్హామ్లను తన తల్లికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేశాడనీ, అంతే మొత్తంలో సొమ్ముని తన కుటుంబానికి పంపించాడనీ, మిగిలిన మొత్తాన్ని ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడని అధికారులు వివరించారు. స్పైసెస్ని ప్యాకేజ్ చేసే సంస్థకు చెందిన కారులో డబ్బు వుంచగా, డ్రైవర్ కారు దిగి వెళ్ళగానే నిందితుడు ఆ డబ్బుని కాజేశాడు. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







