అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చికిత్స నిమిత్తం దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి
- January 10, 2020
యూ.ఏ.ఈ:39 ఏళ్ళ ఆసియా వ్యక్తి ఒకరు 7,500 దిర్హామ్లను కంపెనీ కారు నుంచి దొంగిలిస్తూ దొరికిపోయాడు. విచారణ సందర్భంగా నిందితుడు, ఆ డబ్బును తాను దొంగిలించింది అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్య చికిత్స చేసేందుకోసమేనని చెప్పాడు. నిందితుడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది. దొంగిలించిన సొమ్ముల్లోంచి 1,000 దిర్హామ్లను తన తల్లికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేశాడనీ, అంతే మొత్తంలో సొమ్ముని తన కుటుంబానికి పంపించాడనీ, మిగిలిన మొత్తాన్ని ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడని అధికారులు వివరించారు. స్పైసెస్ని ప్యాకేజ్ చేసే సంస్థకు చెందిన కారులో డబ్బు వుంచగా, డ్రైవర్ కారు దిగి వెళ్ళగానే నిందితుడు ఆ డబ్బుని కాజేశాడు. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!