అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చికిత్స నిమిత్తం దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి
- January 10, 2020
యూ.ఏ.ఈ:39 ఏళ్ళ ఆసియా వ్యక్తి ఒకరు 7,500 దిర్హామ్లను కంపెనీ కారు నుంచి దొంగిలిస్తూ దొరికిపోయాడు. విచారణ సందర్భంగా నిందితుడు, ఆ డబ్బును తాను దొంగిలించింది అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్య చికిత్స చేసేందుకోసమేనని చెప్పాడు. నిందితుడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది. దొంగిలించిన సొమ్ముల్లోంచి 1,000 దిర్హామ్లను తన తల్లికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేశాడనీ, అంతే మొత్తంలో సొమ్ముని తన కుటుంబానికి పంపించాడనీ, మిగిలిన మొత్తాన్ని ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడని అధికారులు వివరించారు. స్పైసెస్ని ప్యాకేజ్ చేసే సంస్థకు చెందిన కారులో డబ్బు వుంచగా, డ్రైవర్ కారు దిగి వెళ్ళగానే నిందితుడు ఆ డబ్బుని కాజేశాడు. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







