గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా?
- January 12, 2020సీజన్ మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్ కారణంగా చల్లటి పానీయాలు సేవించడం, నోరు శుభ్రంగా లేకపోవడం, నోటిలో పుండ్లు ఉన్నప్పుడు గొంతు సమస్యలు వచ్చి ఆహారం సేవించకుండా, మాట్లాడనివ్వకుండా చేస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, సగం స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగితే గొంతు నొప్పి బాగా తగ్గిపోతుంది. అంతే కాకుండా గొంతు నొప్పి ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ పళ్ళరసం వెనిగర్, ఒక స్పూన్ తేనెరసం వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పొక్కిలించినా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగితే అది కూడా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం