కల్పనా చావ్లా, సునీతా విలి యమ్స్ల తరువాత అంతరిక్షయానానికి రెడీ అవుతున్న రాజాచారీ !
- January 12, 2020
భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలి యమ్స్ల తరువాత అంతరిక్షయానం చేసే మూడో భార తీయ అమెరికన్గా రాజా చారికి నాసా అవకాశం కల్పించింది . నాసా తర్వాతి అంతరిక్షయాత్రలో చంద్రుడు లేదా అంగారక గ్రహంపైకి వ్యోమగాములను పంపనుండగా ఇందుకు ఇప్పటికే నాసా 11 మందిని ఎంపిక చేసింది. వీరిలో అమెరికాలో స్థిరపడ్డ రాజా చారి ఉన్నారు.
ఆయన తండ్రి శ్రీనివాసాచారి హైదరా బాద్ వాసి కాగా అమెరికాలో స్థిరపడ్డారు. రాజా చారి అమెరికా లోని టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికా వాయుసేనలో కల్నల్ గా పనిచేస్తున్నారు. సాంకేతిక అంశాల్లో పట్టు, టీమ్ లీడర్ గా గుర్తింపు వల్లే తనకు అవకాశం వచ్చినట్టు రాజాచారి చెప్పా రు. రెండేళ్ల కఠిన శిక్షణ అనంతరం హోస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి మొత్తం 11 మందికి శుక్ర వారం ఈ అవకాశం కల్పించారు.
కాగా, ఇంతకుముందు భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలి యమ్స్లు అంతరిక్షయాత్రలు చేయడం భారతీయులకు తెలిసిన విషయమే.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు