ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురి సంతాపం

- January 13, 2020 , by Maagulf
ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురి సంతాపం

ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్థానంలో రూలర్ గా బాధ్యతలు స్వీకరించిన హైతం బిన్ తారిఖ్ సైద్ కు అల్ ఆలమ్ ప్యాలెస్ లో తమ సంతాపాన్ని తెలిపారు. రాయల్ ఫ్యామిలీ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. డిప్లామాట్స్, కాన్సులెట్ అధికారులు, సీనియర్ స్టేట్ అఫిషియల్స్ తో పాటు సివిలియన్స్ కూడా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసి తమ సంతాపం వ్యక్తం చేశారు. రాయల్ ప్యాలెస్ లో సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసిన ప్రిన్స్ చార్లెస్...సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు ఒమన్ ప్రజలకు సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్ఫూర్తిని ప్రసాదించాలని కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com