ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురి సంతాపం
- January 13, 2020
ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్థానంలో రూలర్ గా బాధ్యతలు స్వీకరించిన హైతం బిన్ తారిఖ్ సైద్ కు అల్ ఆలమ్ ప్యాలెస్ లో తమ సంతాపాన్ని తెలిపారు. రాయల్ ఫ్యామిలీ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. డిప్లామాట్స్, కాన్సులెట్ అధికారులు, సీనియర్ స్టేట్ అఫిషియల్స్ తో పాటు సివిలియన్స్ కూడా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసి తమ సంతాపం వ్యక్తం చేశారు. రాయల్ ప్యాలెస్ లో సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసిన ప్రిన్స్ చార్లెస్...సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు ఒమన్ ప్రజలకు సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్ఫూర్తిని ప్రసాదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







