కేఫ్ ఫోటో వైరల్ కావడంతో నవాజ్ షరీఫ్ ఆరోగ్యంపై పిటిఐ సస్పెన్షన్
- January 14, 2020
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన అనారోగ్యానికి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక హామీతో లండన్ లో చికిత్సకు అంగీకరించింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో చెక్కర్లు కొట్టేస్తోంది. అందులో నవాజ్ షరీఫ్ లండన్ లోని కేఫ్ లో ఇతర కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. దీంతో కంగు తిన్న పంజాబ్ ప్రభుత్వం అతని ఆరోగ్య సమస్యలపై విస్మయానికి గురైంది. పైగా ఇది PML-N విదేశీ చికిత్స యొక్క విస్తరణను కోరిన ప్రాంతీయ ప్రభుత్వానికి నేటి పరిస్థితి చాలా ఇబ్బందులను కలిగిస్తుందని ఆవేదన చెందుతోంది.
వైరల్ ఐన ఫొటోలో నవాజ్ షరీఫ్ కుమారుడు హసన్ నవాజ్, పిఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతని కుమారుడు సల్మాన్ షాబాజ్ మరియు మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తదితరులను చూడవచ్చు.
అయితే, పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ నవాజ్ షరీఫ్ యొక్క తాజా వైద్య నివేదికను వైద్యుల నుండి కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









