1.7 మిలియన్ దిర్హామ్ల మోసం కేసులో నిందితుడిపై విచారణ
- January 14, 2020
ఈజిప్టియన్ బిజినెస్మెన్ ఒకరు, దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని మోసం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడు, కాంట్రాక్టింగ్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. ఆ సంస్థతో ఒప్పదం కుదుర్చుకుని మాస్క్ని నిర్మించనున్నట్లు పేర్కొంటూ 1.7 మిలియన్ దిర్హామ్ల చెక్ని పొందాడు. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లనూ నిందితుడు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. కాగా, నిర్మాణ పనులు ప్రారంభించి, మధ్యలోనే పనులు ఆపేయడంతో, ఒప్పదం కుదుర్చుకున్న బాధిత సంస్థ, బ్యాంకును ఆశ్రయించగా, బ్యాంకు నుంచి చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ ఫోర్జరీవని తేలింది. దాంతో, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదవడం జరిగాయి. కేసు తదుపరి విచారణ జనవరి 23న జరగనుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







