1.7 మిలియన్ దిర్హామ్ల మోసం కేసులో నిందితుడిపై విచారణ
- January 14, 2020
ఈజిప్టియన్ బిజినెస్మెన్ ఒకరు, దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని మోసం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడు, కాంట్రాక్టింగ్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. ఆ సంస్థతో ఒప్పదం కుదుర్చుకుని మాస్క్ని నిర్మించనున్నట్లు పేర్కొంటూ 1.7 మిలియన్ దిర్హామ్ల చెక్ని పొందాడు. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లనూ నిందితుడు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. కాగా, నిర్మాణ పనులు ప్రారంభించి, మధ్యలోనే పనులు ఆపేయడంతో, ఒప్పదం కుదుర్చుకున్న బాధిత సంస్థ, బ్యాంకును ఆశ్రయించగా, బ్యాంకు నుంచి చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ ఫోర్జరీవని తేలింది. దాంతో, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదవడం జరిగాయి. కేసు తదుపరి విచారణ జనవరి 23న జరగనుంది.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









