1.7 మిలియన్‌ దిర్హామ్‌ల మోసం కేసులో నిందితుడిపై విచారణ

- January 14, 2020 , by Maagulf
1.7 మిలియన్‌ దిర్హామ్‌ల మోసం కేసులో నిందితుడిపై విచారణ

ఈజిప్టియన్‌ బిజినెస్‌మెన్‌ ఒకరు, దుబాయ్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని మోసం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడు, కాంట్రాక్టింగ్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ సంస్థతో ఒప్పదం కుదుర్చుకుని మాస్క్‌ని నిర్మించనున్నట్లు పేర్కొంటూ 1.7 మిలియన్‌ దిర్హామ్‌ల చెక్‌ని పొందాడు. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లనూ నిందితుడు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. కాగా, నిర్మాణ పనులు ప్రారంభించి, మధ్యలోనే పనులు ఆపేయడంతో, ఒప్పదం కుదుర్చుకున్న బాధిత సంస్థ, బ్యాంకును ఆశ్రయించగా, బ్యాంకు నుంచి చేసుకున్న అగ్రిమెంట్‌ పేపర్స్‌ అన్నీ ఫోర్జరీవని తేలింది. దాంతో, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదవడం జరిగాయి. కేసు తదుపరి విచారణ జనవరి 23న జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com