ఉరి కన్ఫామ్ చేస్తూ నిర్భయ దోషులకు షాక్ ఇచ్చిన సుప్రీం
- January 14, 2020నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. నిర్భయ దోషులు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీం. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని క్యూరేటివ్ పిటిషన్లో సుప్రీంని కోరారు నిర్భయ దోషులు. అయితే.. ఈ క్యూరేటివ్ పిటిషన్ విచారణకు ఈ దోషులు అర్హులు కారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు నలుగురు దోషులకు డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 22న ఉరిశిక్షను అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఉదయం 7 గంటలకు నలుగురిని ఉరితీయాలని కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 22న ఈ నలుగురికి ఉరిశిక్ష అమలు అవుతుంది. ఐదుగురు జడ్జిల బెంజ్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖేష్, పవన్ గుప్తా, వినయ్, అక్షయ్లను ఉరితీయాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో.. ఢిల్లీలో 7 ఏళ్ల క్రితం జరిగిన జరిగిన కేసులో నలుగురు దోషులను ఉరితీయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ చరిత్రలో ఒకే సారి నలుగురు దోషులను ఉరి తీయబోతున్నారు అధికారులు. కాగా తీహార్ జైలులో ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తీహార్ జైలులో గతంలో ఒకే ఉరి కంభం ఉండేది. కానీ ఇప్పుడు హుటాహుటిన నాలుగు ఉరి కంభాలను సిద్ధం చేశారు అధికారులు.
కాగా నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించింది. చరిత్రలో ఇది మరచిపోలేని రోజని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది నాకు అత్యంత బిగ్ డే అని మీడియాతో మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా నేను చట్టం కోసం పోరాడుతున్నా.. ఇప్పటికి నా కల తీరిందని ఆవిడ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరి తీస్తున్నారని ఆశాదేవి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్