శ్రీలంకలో ఏడుగురు భారతీయులు అరెస్టు
- January 14, 2020
కొలంబో : వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు తీరినప్పటికీ, అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్, ఎమ్మిగ్రేషన్ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్ ట్రిప్ అని శ్రీలంకకు చేరుకుని గడువు దాటినా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పాస్పోర్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







