శ్రీలంకలో ఏడుగురు భారతీయులు అరెస్టు
- January 14, 2020
కొలంబో : వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు తీరినప్పటికీ, అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్, ఎమ్మిగ్రేషన్ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్ ట్రిప్ అని శ్రీలంకకు చేరుకుని గడువు దాటినా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పాస్పోర్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారని సమాచారం.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







