డార్లింగ్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్
- January 16, 2020
తెలుగు వారి పెద్ద పండుగ జనవరి 16 కనుమతో ముగుస్తుంది. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ సంక్రాంతిని మరో రోజు పొడిగించాడు. అవును, అసలు మేటర్ ఏంటంటే.. ప్రభాస్ 'సాహో' తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు 'జాన్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా.. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మూవీ టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నారు.
చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ 'జాన్' మూవీపై అప్డేట్ ఇవ్వాలంటూ డార్లింగ్ను కోరుతున్నారు. సంక్రాంతి పండుగను పొడిగిస్తూ ప్రభాస్ రేపు (జనవరి 17) తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ ఇవ్వనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రేపు డార్లింగ్ 20వ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!