ఇంట్లో చలిమంటలు వద్దు..ప్రజలకు అబుదాబి పోలీస్ హెచ్చరిక
- January 16, 2020యూ.ఏ.ఈ:ఇళ్లలో ఎవరూ బొగ్గు, కట్టెలు కాల్చొద్దని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలితీవ్రత అమాంతంగా పెరిగింది. కొన్ని డివిజన్లలో టెంపరేచర్ మైనస్ లోకి వెళ్లిపోయాయి. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ పర్వత ప్రాంతంలో మంచు కూడా కురుస్తున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. చలితీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు ఇంట్లోనే చలిమంటలు వేసుకునే అవకాశాలు ఉండటంతో అబుదాబి పోలీసులు ముందస్తు హెచ్చరికలు సూచించారు. వెచ్చదనం కోసం ఎవరూ ఇంట్లో బొగ్గు, చెక్కలను కాల్చొద్దని వాటి నుంచి వెలువడే డేంజరస్ గ్యాస్ తో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. క్లోజ్డ్ ప్లేసెస్లో బొగ్గు, చెక్కలతో మంటపెడితే ప్రమాదకరమైన బెంజ్, కార్బన్ మోనాక్సైడ్, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ వంటి విషవాయువులు వెలువడుతాయి. వీటి ద్వారా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బొగ్గు నుంచి వచ్చే పొగతో ఒక్కొసారి నిద్రలోనే ప్రాణాలు కొల్పోయే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన