ఇంట్లో చలిమంటలు వద్దు..ప్రజలకు అబుదాబి పోలీస్ హెచ్చరిక
- January 16, 2020యూ.ఏ.ఈ:ఇళ్లలో ఎవరూ బొగ్గు, కట్టెలు కాల్చొద్దని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలితీవ్రత అమాంతంగా పెరిగింది. కొన్ని డివిజన్లలో టెంపరేచర్ మైనస్ లోకి వెళ్లిపోయాయి. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ పర్వత ప్రాంతంలో మంచు కూడా కురుస్తున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. చలితీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు ఇంట్లోనే చలిమంటలు వేసుకునే అవకాశాలు ఉండటంతో అబుదాబి పోలీసులు ముందస్తు హెచ్చరికలు సూచించారు. వెచ్చదనం కోసం ఎవరూ ఇంట్లో బొగ్గు, చెక్కలను కాల్చొద్దని వాటి నుంచి వెలువడే డేంజరస్ గ్యాస్ తో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. క్లోజ్డ్ ప్లేసెస్లో బొగ్గు, చెక్కలతో మంటపెడితే ప్రమాదకరమైన బెంజ్, కార్బన్ మోనాక్సైడ్, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ వంటి విషవాయువులు వెలువడుతాయి. వీటి ద్వారా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బొగ్గు నుంచి వచ్చే పొగతో ఒక్కొసారి నిద్రలోనే ప్రాణాలు కొల్పోయే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా