అబుధాబి లో ఘోర రోడ్డు ప్రమాదం..6గురు మృతి,19 మందికి గాయాలు...మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
- January 16, 2020
అబుధాబి: అబుధాబిలో గురువారం ఉదయం 'అల్ రహా బీచ్ రోడ్' లో ట్రాఫిక్ ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. గాయపడిన 19 మందిలో 16 మంది నేపాలీ నివాసితులు ఉన్నారు అని యూఏఈ లోని నేపాల్ రాయబారి కృష్ణ ప్రసాద్ ధకల్ ధృవీకరించారు. తక్కినవారు ఎం దేశానికి చెందినవారు అనే సమాచారాం ఇంకా తెలియాల్సి ఉంది అని పోలీసు ప్రకటనలో తెలిపారు.
“బాధితులను తక్షణ చికిత్స కోసం అబుధాబిలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్వల్ప గాయాలకు చికిత్స పొందిన బాధితులలో కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. నేపాల్ బాధితులు ఎక్కడ పనిచేశారు, మరియు వారి వయస్సుపై సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు” అని ధకల్ అన్నారు. ఈ ప్రమాదంలో కొంతమంది మరణించి కూడా ఉండవచ్చు కానీ దీనిని ఇంకా ధృవీకరించలేము అని ఆయన అన్నారు.
అబుధాబి పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ప్రకారం, ఒక తెల్లని కారు రోడ్డుపై ఆగిపోయింది. దాంతో రెండు లారీలు అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించాయి. అప్పుడు వేగాన్ని తగ్గించలేని బస్సు రెండవ లారీలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడినవారు బస్సులోని వారే కావడం విషాదకరం.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







