హిజ్బుల్లాకు మరో షాక్..టెర్రరిస్ట్ సంస్థగా గుర్తిస్తూ అసెట్స్ ఫ్రీజ్ చేసిన యూకే

- January 18, 2020 , by Maagulf
హిజ్బుల్లాకు మరో షాక్..టెర్రరిస్ట్ సంస్థగా గుర్తిస్తూ అసెట్స్ ఫ్రీజ్ చేసిన యూకే

లండన్:హిజ్బుల్లా సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హిజ్బుల్లా సంస్థను ఉగ్రవాద సంస్థల లిస్టులో చేరుస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. టెర్రరిసమ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రూల్స్ మేరకు హిజ్బుల్లా ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్రిటన్ ట్రేజరి ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థను యూఎస్ ఉగ్రవాద సంస్థగా గుర్తించి బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు యూకే కూడా ఆస్తులను ఫ్రీజ్ చేయటంతో హిజ్బుల్లా సంస్థకు ఆర్ధికపరమైన చిక్కులు తప్పేలా లేవు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com