ఎన్టీఆర్కు నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- January 18, 2020
హైదరాబాద్:టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం నెక్లెస్రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, పురందేశ్వరి, సుహాసిని, రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ ప్రదక్షణ చేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. ఎన్టీఆర్ ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఆడపడుచుల కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. తెలుగుజాతి కీర్తిప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దే అని రామకృష్ణ, సుహాసిని అన్నారు.
మరోవైపు పెద్దసంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఆయన అభిమానులు, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







