ఎన్టీఆర్కు నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- January 18, 2020
హైదరాబాద్:టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం నెక్లెస్రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, పురందేశ్వరి, సుహాసిని, రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ ప్రదక్షణ చేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. ఎన్టీఆర్ ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఆడపడుచుల కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. తెలుగుజాతి కీర్తిప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దే అని రామకృష్ణ, సుహాసిని అన్నారు.
మరోవైపు పెద్దసంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఆయన అభిమానులు, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







