తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి
- January 18, 2020
దోహా:దోహాలో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి కలిగింది.వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కి చెందిన సతీష్ అనే యువకుకుడు గత 3 నెలల క్రితం హౌస్ డ్రైవర్ అని వచ్చాడు.కానీ అతనికి పశువుల కాపారిగా పని చెయ్యమని చెప్పడంతోఅతనికి ఏమి చెయ్యాలో ,ఎక్కడికి వెళ్లాలో అయోమయంలో ఉండగా ఇండియాలో సామాజిక వేత్త బసంత్ రెడ్డి కి వారి బంధువులు సంప్రదించగా .సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు,ఆవిషయం తెలంగాణ గల్ఫ్ సమితి కి తెలియడంతో హుటా హుటిన బయలుదేరి అతనిని మొదట అక్కడి నుంచి విముక్తి కల్పించి, ఆశ్రయం కల్పించారు.పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉండడంతో అతినికి కాల్ చేస్తే, పోయిందని చెప్పగా ఈ విషయాన్ని భారత రాయబారి కి గల్ఫ్ సమితి బృందం ప్రత్యేకంగా కలసి విన్నవించుకుంది.ఎంబసీ బృందం వెంటనే ఖతార్ ప్రభుత్వానికి అధికార మెయిల్ చెయ్యడం తో.. ఈ కేసు దాదాపు 2 నెలలు వాయిదాలు పడుతూ ఆఖరికి యజమానికి జరిమానా విధించి ,బాధితుడి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇవ్వడం తో ఈ రోజు ఆ కార్మికుడు స్వదేశానికి బయలుదేరాడు.
ముఖ్యంగా ఎంబసీ అధికారి దిరాజ్ కుమార్, ICBF ప్రతినిధి రజిని మూర్తి కి సహాయం చేసినందుకు బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
తెలంగాణ గల్ఫ్ సమితి విన్నవించుకునేది ఏంటంటే..ఖతార్ లో ఏ ఆపద వచ్చిన మనం ఓపికతో చట్టబద్ధంగా వెళితే, సహాయం తప్పకుండా మనకు దక్కుతుంది.మీకు తెలంగాణ గల్ఫ్ సమితి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!