తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి
- January 18, 2020దోహా:దోహాలో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి కలిగింది.వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కి చెందిన సతీష్ అనే యువకుకుడు గత 3 నెలల క్రితం హౌస్ డ్రైవర్ అని వచ్చాడు.కానీ అతనికి పశువుల కాపారిగా పని చెయ్యమని చెప్పడంతోఅతనికి ఏమి చెయ్యాలో ,ఎక్కడికి వెళ్లాలో అయోమయంలో ఉండగా ఇండియాలో సామాజిక వేత్త బసంత్ రెడ్డి కి వారి బంధువులు సంప్రదించగా .సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు,ఆవిషయం తెలంగాణ గల్ఫ్ సమితి కి తెలియడంతో హుటా హుటిన బయలుదేరి అతనిని మొదట అక్కడి నుంచి విముక్తి కల్పించి, ఆశ్రయం కల్పించారు.పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉండడంతో అతినికి కాల్ చేస్తే, పోయిందని చెప్పగా ఈ విషయాన్ని భారత రాయబారి కి గల్ఫ్ సమితి బృందం ప్రత్యేకంగా కలసి విన్నవించుకుంది.ఎంబసీ బృందం వెంటనే ఖతార్ ప్రభుత్వానికి అధికార మెయిల్ చెయ్యడం తో.. ఈ కేసు దాదాపు 2 నెలలు వాయిదాలు పడుతూ ఆఖరికి యజమానికి జరిమానా విధించి ,బాధితుడి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇవ్వడం తో ఈ రోజు ఆ కార్మికుడు స్వదేశానికి బయలుదేరాడు.
ముఖ్యంగా ఎంబసీ అధికారి దిరాజ్ కుమార్, ICBF ప్రతినిధి రజిని మూర్తి కి సహాయం చేసినందుకు బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
తెలంగాణ గల్ఫ్ సమితి విన్నవించుకునేది ఏంటంటే..ఖతార్ లో ఏ ఆపద వచ్చిన మనం ఓపికతో చట్టబద్ధంగా వెళితే, సహాయం తప్పకుండా మనకు దక్కుతుంది.మీకు తెలంగాణ గల్ఫ్ సమితి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు