బీజేపీ కొత్త సారథి జె.పీ.. నడ్డా
- January 20, 2020
బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పీ.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రాలను పార్టీ ఎన్నికల ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఏడాది క్రితం నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.. కాగా-తనపై తాజాగా పార్టీ అధినాయకత్వం పెట్టిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని నడ్డా పేర్కొన్నారు. ఆయనను పార్టీ మాజీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు అభి నందించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!