బీజేపీ కొత్త సారథి జె.పీ.. నడ్డా
- January 20, 2020బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పీ.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రాలను పార్టీ ఎన్నికల ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఏడాది క్రితం నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.. కాగా-తనపై తాజాగా పార్టీ అధినాయకత్వం పెట్టిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని నడ్డా పేర్కొన్నారు. ఆయనను పార్టీ మాజీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు అభి నందించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!