బీజేపీ కొత్త సారథి జె.పీ.. నడ్డా
- January 20, 2020
బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పీ.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రాలను పార్టీ ఎన్నికల ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఏడాది క్రితం నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.. కాగా-తనపై తాజాగా పార్టీ అధినాయకత్వం పెట్టిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని నడ్డా పేర్కొన్నారు. ఆయనను పార్టీ మాజీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు అభి నందించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







