ఇస్లాంని కించపర్చినందుకు 500,000 దిర్హామ్‌ల జరీమానా

- January 21, 2020 , by Maagulf
ఇస్లాంని కించపర్చినందుకు 500,000 దిర్హామ్‌ల జరీమానా

ఓ ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌కి చెందిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికీ 500,000 దిర్హామ్‌లు జరీమానా విధించింది దుబాయ్‌ కోర్టు. సోషల్‌ మీడియా వేదికగా నిందితులు ఇస్లాంని కించపర్చేలా వ్యవహరించారని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులు శ్రీలంకకు చెందినవారు. 28 నుంచి 34 ఏళ్ళ వయసు వ్యక్తులు ఈ ముగ్గురూ. ఇన్‌స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌బుక్‌ ద్వారా నిందితులు ఇస్లాంని అవమానించారు. మే 19న ఈ ఘటన జరిగింది. అల్‌ బర్షా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితుల నేరం నిరూపితమయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com