దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఇండియన్ కి జాక్పాట్ !
- January 22, 2020
దుబాయ్:దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఇండియన్ కి జాక్పాట్ కొట్టాడు. అబుధాబిలో ఉండే ఏకే మొహమ్మద్(51) అనే వ్యక్తికి మంగళవారం తీసిన మిలీనియం మిలియనీర్ లాటరీ డ్రాలో ఏకంగా రూ. 7 కోట్లకు పైగా గెలుచుకున్నాడు. 20 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న ఏకే మొహమ్మద్ ఓ నిర్మాణ సంస్థలో టెక్నికల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. ఈసారి కూడా మిలీనియం మిలియనీర్లో 321 సిరీస్లో నెం.3644తో లాటరీ టికెట్ కొన్నాడు. ఈ టికెటే ఏకే మొహమ్మద్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అతను కొనుగోలు చేసిన ఈ టికెట్కు ఏకంగా మిలియన్ డాలర్లు తగిలాయి. దీంతో ఏకే మొహమ్మద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఇదే డ్రాలో మరో భారత వ్యక్తి అనీష్ చాకో కొనుగోలు చేసిన సిరీస్ 395, టికెట్ నెం.0327కు కూడా లాటరీ తగిలింది. దీంతో అనీష్ మోటో గుజ్జీ మిలానో మోటర్బైక్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఏకే మొహమ్మద్ మాట్లాడుతూ నెలకు ఇద్దరిని కోటీశ్వర్లుగా చేస్తున్న దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







