దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఇండియన్ కి జాక్పాట్ !
- January 22, 2020
దుబాయ్:దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఇండియన్ కి జాక్పాట్ కొట్టాడు. అబుధాబిలో ఉండే ఏకే మొహమ్మద్(51) అనే వ్యక్తికి మంగళవారం తీసిన మిలీనియం మిలియనీర్ లాటరీ డ్రాలో ఏకంగా రూ. 7 కోట్లకు పైగా గెలుచుకున్నాడు. 20 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న ఏకే మొహమ్మద్ ఓ నిర్మాణ సంస్థలో టెక్నికల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. ఈసారి కూడా మిలీనియం మిలియనీర్లో 321 సిరీస్లో నెం.3644తో లాటరీ టికెట్ కొన్నాడు. ఈ టికెటే ఏకే మొహమ్మద్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అతను కొనుగోలు చేసిన ఈ టికెట్కు ఏకంగా మిలియన్ డాలర్లు తగిలాయి. దీంతో ఏకే మొహమ్మద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఇదే డ్రాలో మరో భారత వ్యక్తి అనీష్ చాకో కొనుగోలు చేసిన సిరీస్ 395, టికెట్ నెం.0327కు కూడా లాటరీ తగిలింది. దీంతో అనీష్ మోటో గుజ్జీ మిలానో మోటర్బైక్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఏకే మొహమ్మద్ మాట్లాడుతూ నెలకు ఇద్దరిని కోటీశ్వర్లుగా చేస్తున్న దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







