బర్ దుబాయ్ విల్లాలో ఇద్దరు హౌస్ మెయిడ్స్ మృతి
- January 22, 2020
దుబాయ్: ఇద్దరు ఆసియా జాతీయులైన మెయిడ్స్, బర్ దుబాయ్లోని ఓ విల్లాలో మృతి చెందారు. స్పాన్సర్కి చెందిన విల్లాలో చార్కోల్ పొగ కారణంగా వీరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రూమ్ని వెచ్చగా వుంచుకునేందుకోసం చార్కోల్ని మండించారనీ, రాత్రి వారు నిద్రపోగా.. ఆ రూమ్ అంతా పొగ వ్యాపించి, ఊపిరి ఆడక అందులోనే వారు మృతి చెందినట్లు వివరించారు పోలీసులు. విల్లా ఓనర్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే వీరి మృతి సంభవించిందని దుబాయ్ పోలీస్కి చెందిన సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్ చెప్పారు. ఈ తరహా ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, వెచ్చదనం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







