బర్ దుబాయ్ విల్లాలో ఇద్దరు హౌస్ మెయిడ్స్ మృతి
- January 22, 2020
దుబాయ్: ఇద్దరు ఆసియా జాతీయులైన మెయిడ్స్, బర్ దుబాయ్లోని ఓ విల్లాలో మృతి చెందారు. స్పాన్సర్కి చెందిన విల్లాలో చార్కోల్ పొగ కారణంగా వీరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రూమ్ని వెచ్చగా వుంచుకునేందుకోసం చార్కోల్ని మండించారనీ, రాత్రి వారు నిద్రపోగా.. ఆ రూమ్ అంతా పొగ వ్యాపించి, ఊపిరి ఆడక అందులోనే వారు మృతి చెందినట్లు వివరించారు పోలీసులు. విల్లా ఓనర్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే వీరి మృతి సంభవించిందని దుబాయ్ పోలీస్కి చెందిన సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్ చెప్పారు. ఈ తరహా ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, వెచ్చదనం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







