`జాను` ఫ్రిబ్రవరి 7న సినిమా గ్రాండ్ రిలీజ్
- January 22, 2020_1579699727.jpg)
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరికల్ వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
``ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ
తారా తీరం మన దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా...`` అంటూ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమలోని గాఢత ఈ పాటలో తెలియచేస్తుంది.
గోవింద్ వసంత సంగీత సారథ్యంలో శ్రీమణి రాసిన ఈ పాటను చిన్నయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
శర్వానంద్, సమంత
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సి.ప్రేమ్కుమార్
నిర్మాతలు: దిల్రాజు, శిరీష్
సమర్పణ: శ్రీమతి అనిత
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
మాటలు: మిర్చి కిరణ్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!