గణతంత్ర వేడుకల రద్దుకు కారణమైన 'కరోనా వైరస్'
- January 24, 2020ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న 'కరోనా వైరస్' గణతంత్ర వేడుకలు రద్దయ్యేలా చేసింది. చైనా రాజధాని బీజింగ్లో ఇండియన్ ఎంబసీలో జరిపే రిపబ్లిక్ డే ఉత్సవాలను రద్దు చేశారు అధికారులు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఇప్పటికే 25 మందిని బలి తీసుకోగా.. మరో 800 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్గుగా ఇండియన్ ఎంబసీ ప్రకటనలో తెలిపింది.
కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చైనాలో ప్రజలు పెద్ద ఎత్తున గుమి కూడడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా చైనాలోని ఎంబసీలో కూడా ఈ మేరకు ఆంక్షలు విధించింది. చైనాలోని భారతీయుల క్షేమ సమాచారం కోసం రెండు హాట్ లైన్లను కూడా ఎంబసీ ఏర్పాటు చేసింది. చైనాలోని భారత రాయబార కార్యాలయంను సమాచారం కోసం సంమప్రదించాలంటే +8618612083629 మరియు +8618612083617 ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి.
ఇదే సమయంలో భారత్కు వెళ్లే చైనా వాళ్లకు కూడా బీజింగ్లోని భారత ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. విమానంలో ప్రయాణించే సమయంలో అస్వస్థతకు గురైతే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. ముఖానికి మాస్కులు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని కోరింది. దగ్గే సమయంలో ముఖానికి ఏదైనా వస్త్రాన్ని అడ్డుపెట్టుకోవాలలంటూ సూచనలు చేసింది.
In view of the evolving situation due to the corona virus outbreak in China as well as the decision of Chinese authorities to cancel public gathering and events, @EOIBeijing has also decided to call off the Republic Day reception scheduled to be held @EOIBeijing on January 26th.
— India in China (@EOIBeijing) January 24, 2020
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..