పెద్ద సంఖ్యలో ఇమిటేషన్ గూడ్స్ స్వాధీనం
- January 24, 2020
కువైట్: జనరల్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ - కస్టమ్స్ అధికారులు దేశంలోకి అక్రమంగా స్మగుల్ అవుతున్న వస్తువుల్ని అరికట్టడంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులు నార్త్ పోర్ట్లో పెద్దయెత్తున ఇమిటేషన్ గూడ్స్ స్మగుల్ అవుతుండగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. లోకల్ మార్కెట్కి వీటిని తరలించేందుకు ప్రయత్నం జరుగుతుండగా, వాటిని అధికారులు అడ్డుకున్నారు. ఇమిటేషన్ గూడ్స్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేస్తారు. కాగా, షుయైబా పోర్ట్ వద్ద అధికారులు, ఓ కంటెయినర్పై అనుమానంతో స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తెరిచి చూడగా, పెద్దయెత్తున మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, బ్యాటరీలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాలూకు యాక్సెసరీస్ కనిపించాయి. వీటిని సంబంధిత శాఖలకు పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







