యాంకర్ ప్రదీప్ హీరోగా చిత్రం.. మోషన్ పోస్టర్లని ఆవిష్కరించిన రానా
- January 26, 2020

ప్రదీప్ మాచిరాజు ఓ ప్రక్కన యాంకర్ గా చేస్తూనే..మరో ప్రక్క సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా మారి ఓ చిత్రం చేసారు. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ద్వారా మున్నా అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసారు మున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్లని హీరో రానా ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. మేం డిజైన్ చేసిన పేరుకి మంచి స్పందన లభించింది. రానా ఈ పోస్టర్ల కాన్సెప్ట్ని మెచ్చుకున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము’’అని అన్నారు.
ఫస్ట్ లుక్ పోస్టరులో గ్రామీణుడిగా ప్రదీప్ కనిపించాడు. ఈ లుక్ సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్ను తలపిస్తోంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్ను రూపకల్పన చేశారు. శివన్నారాయణ, హేమ, పోసాని, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







