న్యూఢిల్లీ పరేడ్‌లో తిరుమల బ్రహ్మోత్సవ శకటం...

- January 26, 2020 , by Maagulf
న్యూఢిల్లీ పరేడ్‌లో  తిరుమల బ్రహ్మోత్సవ శకటం...

న్యూఢిల్లీ:ప్రతీ సంవత్సరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు... వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్ని పరేడ్‌లో ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 16 రాష్ట్రాల శకటాల్ని కేంద్రం ఆమోదించింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ శకటాల్ని ప్రదర్శించే ఛాన్స్ దొరికింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని పోలిన శకటాన్ని ప్రదర్శించింది. న్యూఢిల్లీ పరేడ్‌లో మిగతా శకటాల కంటే... ఈ శకటం ప్రత్యేకంగా కనిపిస్తూ... తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com