ఏపీ:మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం
- January 27, 2020
ఏపీ:ముందు నుండి చెబుతున్నట్లుగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశమే ప్రధానం అజెండాగా సమావేశమైన కేబినెట్ తొలి అంశంగా దీని పైనే చర్చ చేసింది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మండలి పరిణామాల పైన ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. ప్రజా మేలు కోసం తీసుకొనే నిర్ణయాలకు అడ్డు చెప్పే మండలి అవసరం లేదని పలువురు మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
దీంతో..కేబినెట్ ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయం మేరకు కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదిస్తారు. ప్రతిపక్షం టీడీపీ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. అయినా.. ప్రభుత్వం దీనిపైన చర్చించి..ప్రతిపక్షం అభిప్రాయంగా జనసేన ఎమ్మెల్యే చెప్పే అంశాలను రికార్డు చేయనున్నారు. దీని పైన చర్చ తరువాత మండలి రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ
ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.
ప్రభుత్వం అనుకున్న విధంగానే ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. తొలుత సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవ టం వెనుక కారణాలను సహచర మంత్రులకు వివరించారు. మండలిలో సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం బోస్..మోపిదేవి ముందుగా మండలి రద్దుకు తమ మద్దతు ఉంటుందని కేబినెట్ లో ముఖ్యమంత్రికి స్పష్టం చేసారు. మిగిలిన మంత్రులు సైతం సీఎం నిర్ణయం సరైనదేనంటూ మద్దతిచ్చారు. దీంతో..తొలి అంశంగానే మండలి రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి అనుగుణంగానే ఇదే రోజు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. దీని ద్వారా 2007లో వైయస్సార్ ప్రభుత్వంలో పునరుద్దరించిన ఏపీ శాసనమండలి ఆయన తనయుడి ప్రభుత్వంలో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం వెళ్లనుంది. కేంద్రం ఎప్పటి లోగా దీని పైన తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కర అంశం. అప్పటి వరకు మండలి సమావేశాలు..సెలెక్ట్ కమిటీ తమ విధులు తాము కొనసాగిస్తాయి.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









