8 కిలోలకు పైబడిన క్యాబిన్ లగేజ్కి ఛార్జీ
- January 27, 2020
ఒమన్ నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు 8 కిలోల లిమిట్ మించితే క్యాబిన్ లగేజ్కి ఛార్జీ వర్తిస్తుంది. మస్కట్లో ఎయిర్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్ వెయిట్ హ్యాండ్ బ్యాగేజీ ఇకపై ఛార్జ్ చేయబడుతుందనేది ఆ ప్రకటన సారాంశం. డ్యూటీ ఫ్రీ షాప్స్లో కొనుగోలు చేసే వస్తువులకూ ఇది వర్సించనుంది. ప్రతి అదనపు కిలోగ్రామ్కీ 6 ఒమన్ రియాల్స్ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబిన్ లగేజ్ బరువు 10 కిలోలకు మించరాదు. ఇందులో 8 కిలోల బ్యాగేజ్ ఉచితం కాగా, రెండు కిలోలకి అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. 10 కిలోల బరువు మించితే క్యాబిన్లోకి అనుమతించరు లగేజ్ని. అలాగే హ్యాండ్ బ్యాగేజీ 55 సెంటీమీటర్ల ఎత్తు, 35 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పుని మించకూడదు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









