8 కిలోలకు పైబడిన క్యాబిన్ లగేజ్కి ఛార్జీ
- January 27, 2020
ఒమన్ నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు 8 కిలోల లిమిట్ మించితే క్యాబిన్ లగేజ్కి ఛార్జీ వర్తిస్తుంది. మస్కట్లో ఎయిర్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్ వెయిట్ హ్యాండ్ బ్యాగేజీ ఇకపై ఛార్జ్ చేయబడుతుందనేది ఆ ప్రకటన సారాంశం. డ్యూటీ ఫ్రీ షాప్స్లో కొనుగోలు చేసే వస్తువులకూ ఇది వర్సించనుంది. ప్రతి అదనపు కిలోగ్రామ్కీ 6 ఒమన్ రియాల్స్ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబిన్ లగేజ్ బరువు 10 కిలోలకు మించరాదు. ఇందులో 8 కిలోల బ్యాగేజ్ ఉచితం కాగా, రెండు కిలోలకి అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. 10 కిలోల బరువు మించితే క్యాబిన్లోకి అనుమతించరు లగేజ్ని. అలాగే హ్యాండ్ బ్యాగేజీ 55 సెంటీమీటర్ల ఎత్తు, 35 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పుని మించకూడదు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







