8 కిలోలకు పైబడిన క్యాబిన్ లగేజ్కి ఛార్జీ
- January 27, 2020ఒమన్ నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు 8 కిలోల లిమిట్ మించితే క్యాబిన్ లగేజ్కి ఛార్జీ వర్తిస్తుంది. మస్కట్లో ఎయిర్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్ వెయిట్ హ్యాండ్ బ్యాగేజీ ఇకపై ఛార్జ్ చేయబడుతుందనేది ఆ ప్రకటన సారాంశం. డ్యూటీ ఫ్రీ షాప్స్లో కొనుగోలు చేసే వస్తువులకూ ఇది వర్సించనుంది. ప్రతి అదనపు కిలోగ్రామ్కీ 6 ఒమన్ రియాల్స్ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబిన్ లగేజ్ బరువు 10 కిలోలకు మించరాదు. ఇందులో 8 కిలోల బ్యాగేజ్ ఉచితం కాగా, రెండు కిలోలకి అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. 10 కిలోల బరువు మించితే క్యాబిన్లోకి అనుమతించరు లగేజ్ని. అలాగే హ్యాండ్ బ్యాగేజీ 55 సెంటీమీటర్ల ఎత్తు, 35 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పుని మించకూడదు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్