ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది ఈ ధ్యాన మందిరం
- January 28, 2020
ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్ లోని ధ్యాన మందిరం.. మంగళవారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై.. ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని కన్హ గ్రామంలో.. హార్ట్ ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ధ్యాన మందిర నిర్మాణం జరిగింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యానమందిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తాబేలు ఆకారంలో నిర్మించారు. దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసేందుకు వీలుగా దీనిని నిర్మించారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ధ్యానకేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..