భారత రాయబారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన బహ్రెయిన్

- January 29, 2020 , by Maagulf
భారత రాయబారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన బహ్రెయిన్

బహ్రెయిన్:పదవీ కాలం ముగించుకొని తిరిగి వెళ్తున్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాకు బహ్రెయిన్ విదేశాంగ శాఖ ఆత్మీయ వీడ్కోలు పలికింది. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న బహ్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరి..భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సేవలను ప్రశంసించారు. బహ్రెయిన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఆయన చేసిన కృషి చేశారని అభినందించారు. అదే సమయంలో బహ్రెయిన్ విదేశాంగ శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులు తనకు అందించిన ప్రొత్సాహం, సహకారం మరువలేనిదని  విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరిని అలోక్ కుమార్ ప్రశంసించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com