దుబాయ్ : స్మగ్లింగ్ రాకెట్ బ్లాస్ట్.. 73 కేజీల క్రిస్టల్ మెత్ సీజ్
- January 29, 2020
జెబెల్ అలీ కస్టమ్స్ సెంటర్ టీం క్రిస్టల్ మెత్ స్మగ్లింగ్ రాకెట్ ను బ్లాస్ట్ చేసింది. స్మగ్లర్ల నుంచి 73 కిలోల క్రిస్టల్ మెత్ ను స్వాధీనం చేసుకుంది. వెహికిల్ స్పెర్ పార్ట్స్ లో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో మత్తుపదార్థాల రవాణాను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇల్లీగల్ గూడ్స్, డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు, వాటిని గుర్తించేందుకు అధునాతన ఇక్విప్మెంట్ ఉందని జెబెల్ అలీ కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న స్మార్ట్ స్కానింగ్ సిస్టమ్ తో ఒక గంటలనే 150 కంటేనర్లను స్కాన్ చేయవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం తమ దగ్గర 6 స్కానర్లు ఉన్నాయని, వాటి ద్వారా గంటలో 900 కంటేనర్లను సునిశితంగా స్కాన్ చేసే అవకాశం ఉందన్నారు. తమకు ఎప్పటికప్పుడు దుబాయ్ యాంటీ నార్కొటిక్ డిపార్ట్మెంట్ సహాకారం అందుతోందని..వారి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రతీ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న అధునాతన స్కానర్లతో ప్రతీ కంటెనర్ ను క్షణ్ణంగా తనిఖీ చేపడుతున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







