స్పైనల్ స్ట్రోక్: సాయం కోరుతున్న భారత యువకుడు
- January 30, 2020
బహ్రెయిన్:20 ఏళ్ళ భారత యువకుడు ఒకరు బహ్రెయిన్లో అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు.సెగాయాలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న ముహ్సిన్ అనే యువకుడు, ఆరు నెలల క్రితమే బహ్రెయిన్కి వచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాకి చెందిన యువకుడు ముహ్సిన్, ఇటీవల అనారోగ్యానికి గురికాగా, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, అతనకు స్పైనల్ స్ట్రోక్ వచ్చినట్లు తేల్చారు.ప్రస్తుతం అతను కొంత మేర కోలుకున్నా, సాధారణ జీవితాన్ని పొందడానికి ఇంకొంత వైద్య చికిత్స అవసరం.పేద కుటుంబానికి చెందిన ముహ్సిన్, దాతల నుంచి ఆర్థిక సాయం కోరుతున్నారు.పలువురు వలసదారులు కమిటీగా ఏర్పడి, ముహ్సిన్కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు.డాక్టర్ పివి చెరియన్, సోషల్ వర్కర్స్ సుబైర్ కన్నుర్,కెటి సలీమ్ మరియు నాసర్ మంచెర్రి తదితరులు ఈ బాధ్యతను స్వీకరించారు.సాయం చేయాలనుకున్నవారు 35476523కి ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







