స్పైనల్ స్ట్రోక్: సాయం కోరుతున్న భారత యువకుడు
- January 30, 2020
బహ్రెయిన్:20 ఏళ్ళ భారత యువకుడు ఒకరు బహ్రెయిన్లో అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు.సెగాయాలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న ముహ్సిన్ అనే యువకుడు, ఆరు నెలల క్రితమే బహ్రెయిన్కి వచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాకి చెందిన యువకుడు ముహ్సిన్, ఇటీవల అనారోగ్యానికి గురికాగా, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, అతనకు స్పైనల్ స్ట్రోక్ వచ్చినట్లు తేల్చారు.ప్రస్తుతం అతను కొంత మేర కోలుకున్నా, సాధారణ జీవితాన్ని పొందడానికి ఇంకొంత వైద్య చికిత్స అవసరం.పేద కుటుంబానికి చెందిన ముహ్సిన్, దాతల నుంచి ఆర్థిక సాయం కోరుతున్నారు.పలువురు వలసదారులు కమిటీగా ఏర్పడి, ముహ్సిన్కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు.డాక్టర్ పివి చెరియన్, సోషల్ వర్కర్స్ సుబైర్ కన్నుర్,కెటి సలీమ్ మరియు నాసర్ మంచెర్రి తదితరులు ఈ బాధ్యతను స్వీకరించారు.సాయం చేయాలనుకున్నవారు 35476523కి ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!