కువైట్:జైలు నుంచే స్కెచ్..రాయల్స్, బిజినెస్ పర్సన్స్ కు లక్షల్లో టోకరా
- February 01, 2020
కువైట్:ఎనిమిది మంది టీం. జైలు నుంచే స్కెచ్. మాయమాటలు చెప్పి రాయల్స్ తో పాటు బిజినెస్ పర్సన్స్ ని బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ బిగ్ ఫ్రాడ్ కేసులో విచారణను క్రిమినల్ కోర్టు మార్చి 11వ తేదికి వాయిదా వేసింది. మొత్తం KD2,593,399 మనీ లాండరింగ్ పాల్పడినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నిందితుడితో ఏడుగురు నిందితులు పలు చీటింగ్ కేసుల్లో జైలులో ఉన్నారు. అయితే..ఓ మహిళలను 400,000 కువైట్ దినార్ లను ఫ్రాడ్ చేసిన కేసులో నిన్న క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదన వినిపించిన బాధితురాలు ఓ రిప్రజెంటీవ్ ద్వారా వస్తువులు కొనేందుకు 400,000 కువైట్ దినార్ ల చెక్ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే..తనకు లగ్జరీ కార్ తో పాటు విలువైన గిఫ్ట్స్ ఇచ్చారని, డబ్బులు కూడా తిరిగి ఇస్తానని నిందితులు తనతో చెప్పారని ఆమె కోర్టుకు వివరించింది. అయితే..నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు