ఈయూ నుంచి వేరుపడిన బ్రిటన్..
- February 01, 2020
లండన్: బ్రిటన్ వేరు కాపురం ఆరంభమైంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోవాలన్న ప్రజాభీష్టం నెరవేరింది. బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చింది. మూడున్నర ఏళ్ల క్రితం నిర్వహించిన రెఫరెండంలో 52ు ప్రజలు బ్రెగ్జిట్ వైపే మొగ్గు చూపారు. ఎన్నో అవాంతరాల మధ్య అది చట్టంగా మారడానికి ఇన్నేళ్లు పట్టింది.
ఈయూ నుంచి వేరుపడిన తొలి దేశం బ్రిటనే! ఈయూతో 47 ఏళ్ల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవడం ద్వారా ప్రపంచదేశాలతో సరికొత్తగా వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు అమిత స్వేచ్ఛ లభిస్తుంది. ఈయూ నుంచి వేరుపడటం అంతం కాదని, ఇదో కొత్త ఆరంభమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రిటన్ చరిత్రలో మరో నూతనాధ్యాయం మొదలైందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







