యూఏఈ లో మరో కరోనా వైరస్ కేసు నమోదు
- February 01, 2020
యూఏఈ: చైనా నగరం వుహాన్ నుండి యూఏఈ కు వచ్చిన ఒకరిలో కరోనా వైరస్ ను ధృవీకరించింది యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ. కాగా, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఐదు కేసులు కరోనా వైరస్ ఖాతాలో చేరాయి.
ఇంతకుముందు గుర్తించిన నాలుగు కేసులు ఇప్పటికీ వైద్య సంరక్షణలో ఉన్నాయని,
వారి పరిస్థితి స్థిరంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కనుగొనబడిన కేసులను పరిష్కరించడంలో WHO ఆదేశాలకు యూఏఈ కట్టుబడి ఉంది మరియు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవరసం లేదని, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడేందుకు దేశంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు మంత్రిత్వ శాఖ తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ, సరైన సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిందిగా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







