యూఏఈ లో మరో కరోనా వైరస్ కేసు నమోదు
- February 01, 2020
యూఏఈ: చైనా నగరం వుహాన్ నుండి యూఏఈ కు వచ్చిన ఒకరిలో కరోనా వైరస్ ను ధృవీకరించింది యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ. కాగా, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఐదు కేసులు కరోనా వైరస్ ఖాతాలో చేరాయి.
ఇంతకుముందు గుర్తించిన నాలుగు కేసులు ఇప్పటికీ వైద్య సంరక్షణలో ఉన్నాయని,
వారి పరిస్థితి స్థిరంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కనుగొనబడిన కేసులను పరిష్కరించడంలో WHO ఆదేశాలకు యూఏఈ కట్టుబడి ఉంది మరియు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవరసం లేదని, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడేందుకు దేశంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు మంత్రిత్వ శాఖ తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ, సరైన సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిందిగా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!